ప్రజలకు BRS ప్రభుత్వం చేసిందేమీ లేదు: సీతక్క

58చూసినవారు
ప్రజలకు BRS ప్రభుత్వం చేసిందేమీ లేదు: సీతక్క
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి సీతక్క మండిపడ్డారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనీసం మంచి నీరూ అందించలేదని విమర్శించారు. రెండు పంటలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు కూడా ఇక్కడ లేవని చెప్పారు. ఉమ్మడి జిల్లా సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్