బీజేపీలో చేరేందుకు బీఆర్ఎస్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ బీబీ పాటిల్ ద్వారా ఆయన అమిత్షా, రాజ్నాథ్ సింగ్ను కలిసినట్టు సమాచారం. రాజ్నాథ్తో మహిపాల్ రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉండి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.