సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ తమ విధానమని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలకులకు కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుందని చెప్పారు. కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నియోజకవర్గ పర్యటనలో అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలకు అధికారులు వేగంగా స్పందిస్తూ ఎఫెక్టివ్గా పనిచేయాలని సూచించారు. నెల రోజుల వ్యవధిలో మార్పు చూపించాలన్నారు.