బీఆర్ఎస్ నేతలపై
బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లోనే బీఆర్ఎస్ నేతలున్నారని ఎద్దేవా చేశారు. గవర్నర్ వ్యవస్థను కించపర్చిన చరిత్ర కేసీఆర్ది అని దుయ్యబట్టారు. ఈనెల 28న కరీంనగర్లో
బీజేపీ కార్యకర్తల సమ్మేళనానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ క్రమంలో మైదానాన్ని బండి సంజయ్ పరిశిలించి మాట్లాడారు.