తమ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 27న ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత అంశంపై హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పు, తదుపరి పరిణామాలను బట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేలందరిపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ చెబుతోంది.