భూవివాదం..ఇంటికి పిలిచి ముగ్గురిని చంపిన దుండగులు

85చూసినవారు
భూవివాదం..ఇంటికి పిలిచి ముగ్గురిని చంపిన దుండగులు
మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో ఓ భూ వివాదం ముగ్గురిని బలి తీసుకుంది. అగ్రిమెంట్ గురించి మాట్లాడేందుకు నిందితులు హోంగార్డు జవాన్ రమేష్ విశ్వకర్మను తమ ఇంటికి పిలిపించుకున్నట్లు సమాచారం. తర్వాత పదునైన ఆయుధంతో అతడిని హత్య చేశారు. ఇదే విషయమై రమేష్ కుమారుడు ఉమేష్, మేనల్లుడు రవి ఇద్దరూ బైక్‌పై దామోహ్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో వీరిని కాల్చి చంపారు. ఈ ఘటన దామోదేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బన్‌స్టార్‌ఖేడా గ్రామంలో జరిగింది.

సంబంధిత పోస్ట్