నేడు మరో రెండు సీట్లను ప్రకటించనున్న బీఆర్ఎస్

1067చూసినవారు
నేడు మరో రెండు సీట్లను ప్రకటించనున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ నేతలతో సమావేశం కానున్నారు. అలాగే నేడు మరో రెండు సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి నామ నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత, కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్‌, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పెద్దపల్లి నుంచి బరిలో దిగనున్నారు.

సంబంధిత పోస్ట్