ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడి 17 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను కిడ్నాప్ చేసి స్మశానవాటికకు ఎత్తుకెళ్ళి బాలికపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన సోమవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులైన ఇజ్రాయెల్, అష్రఫ్ లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.