యువత కోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తు చేయడానికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది. మార్చి 12 వరకే దరఖాస్తు గడువు ముగియగా.. మార్చి 31 వరకు అవకాశం కల్పించారు. ఆసక్తి గలవారు https://www.pminternship.mca.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా దేశంలోని 730 మందికి పైగా జిల్లాల్లో లక్షమందికి పైగా యువతకు టాప్ 500 కంపెనీలలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంది.