ఎండ, కాలుష్యం వల్ల కొందరికి చర్మంపై ముడతలు వస్తాయి. అయితే, కొన్ని సహజ పద్దతుల ద్వారా ముడతలను పొగొట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 15 నిమిషాలు చర్మానికి మసాజ్ చేసుకోవాలి. అలాగే రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి. యోగా, ధ్యానం చేయాలి. ధూమపానం జోలికి వెళ్లకపోవడం, కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం, బొప్పాయి పైతొక్కును ముఖంపై రుద్ది అరగంట తర్వాత నీటితో కడిగితే ముడతలు రాకుండా ఉంటాయి.