చార్టెర్డ్ అకౌంటెంట్ (CA) పరీక్షలకు సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 2025 నుంచి సీఏ ఫైనల్ పరీక్షల్ని సైతం ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. గతేడాది మార్చిలో ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫౌండేషన్ కోర్సు పరీక్షలను ఏడాదికి మూడుసార్లు పెట్టనున్నట్లు తెలిపింది. అయితే తాజాగా సీఐ ఫైనల్ పరీక్షలను సైతం అదే తరహాలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.