లోక్సభ ఎన్నికల తర్వాత కేబినెట్ను విస్తరించాలని సీఎం రేవంత్ యోచిస్తున్నారట. ఆగస్టు 15లోగా పూర్తి కేబినెట్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రాజ్గోపాలరెడ్డి, జి.వివేక్, ప్రేమ్సాగర్ రావు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వి.శ్రీహరి కేబినెట్ బెర్త్ కోసం ముందు వరుసలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు త్వరలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే ఒకరిద్దరికీ అవకాశమున్నట్లు సమాచారం.