ఈ నెల 20న మంత్రివర్గ సమావేశం

73చూసినవారు
ఈ నెల 20న మంత్రివర్గ సమావేశం
ఈ నెల 20వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నుంది. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జ‌ర‌గ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ భేటీలో కొత్త రేష‌న్ కార్డుల జారీకి విధివిధానాలు, హైడ్రాకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌, వ‌ర‌ద న‌ష్టం, రైతు భ‌రోసా, హెల్త్ కార్డులు.. త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

సంబంధిత పోస్ట్