కోడి గుడ్డు చాలా మంది ఇష్టంగా తినే ఆహార పదార్థం. కానీ ఒక పరిశోధనలో మాత్రం గుడ్లు ఎక్కువగా తింటే మధుమేహం బారినపడే ప్రమాదం ఉందని తేలింది. అంతేగాక పురుషుల్లో కంటే మహిళల్లో ఈ రిస్క్ ఎక్కువని తెలిపారు. రోజూ 50 గ్రాముల కంటే తక్కువగా గుడ్లను ఆహారంగా తీసుకునే వారిలో 25 శాతం, రోజూ 50 గ్రాముల కంటే ఎక్కువ గుడ్లు తినేవారిలో 60 శాతం మధుమేహం రిస్క్ పెరుగుతుందని నిర్ధారించారు. గుడ్లను ఉడకబెట్టుకుని తినడం ఉత్తమమన్నారు.