అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'కెప్టెన్ మిల్లర్'. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా ఈనెల 26న తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పటికే పొంగల్ సందర్భంగా ఈనెల 12న తమిళంలో రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, నివేదితా సతీశ్, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.