గుజరాత్లోని పడోదరాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ యువకుడు 100 కి.మీ. వేగంతో కారు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న బైకర్స్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు నడిపిన యువకుడు డియోన్ టెక్నాలజీస్ కంపెనీ యజమాని కుమారుడిగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.