మోష్ పబ్‌పై కేసు నమోదు

81చూసినవారు
మోష్ పబ్‌పై కేసు నమోదు
హైటెక్‌ సిటీలోని మోష్‌ పబ్‌ యాజమాన్యంపై శుక్రవారం సుమోటో కేసు నమోదు చేసినట్లు మాదాపూర్‌ ఎస్సై తెలిపారు. కొన్ని ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్స్‌ ద్వారా అమ్మాయిలతో ఎరవేసి, అలా వచ్చిన కస్టమర్లకు విలువైన మద్యం తాగించి, వారి నుంచి ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన అంశాల ఆధారంగా నమోదైన ఈ కేసు దర్యాప్తులో ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్