కర్ణాటక, తమిళనాడు మధ్య మళ్లీ కావేరీ వివాదం

67చూసినవారు
కర్ణాటక, తమిళనాడు మధ్య మళ్లీ కావేరీ వివాదం
తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ నదీ జలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కర్ణాటకతో కావేరీ నదీ జలాల వివాదంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం నిరాకరించడాన్ని తప్పుబట్టారు. కర్ణాటక ప్రభుత్వ తీరుని అఖిలపక్ష సమావేశం తీవ్రంగా ఖండించిందని స్టాలిన్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్