కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు కొత్తగా ఇద్దరు అదనపు డైరెక్టర్లు నియమితులయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారులైన ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్లను నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరు ఒకే బ్యాచ్కు చెందిన వారు. ఏవైవీ కృష్ణ సీబీఐ అదనపు డైరెక్టర్ బాధ్యతల్లో 2028 ఆగస్టు 6 వరకు కొనసాగుతారు. వేణుగోపాల్ నూతన బాధ్యతల్లో 2027 మే 24 వరకు కొనసాగనున్నట్లు పేర్కొంది.