ఎయిర్ ఇండియాపై సీబీఐ కేసు నమోదు

65చూసినవారు
ఎయిర్ ఇండియాపై సీబీఐ కేసు నమోదు
ఎయిర్ ఇండియా కోసం సాఫ్ట్‌వేర్ కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సంస్థ సీఎండీ, శాప్ ఇండియా, ఐబీఎంపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఆదివారం అధికారులు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ కొనుగోలు విలువ రూ.225 కోట్లని, దీనికి సంబంధించి విధానపరమైన అవకతవకలు గుర్తించిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సీబీఐకి సిఫార్సు చేసింది. దాదాపు ఆరేళ్లు విచారణ జరిపి ఆరుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

సంబంధిత పోస్ట్