ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ టీఎస్ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం కోర్టులో హాజరుపర్చారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఉమామహేశ్వరరావును చంచల్గూడ జైలుకు తరలించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లోని 14 చోట్ల ఏకకాలంలో బృందాలు సోదాలు జరిపాయి.