CCTV: గోదాములో కార్మికులపై పడిన బస్తాలు.. ఒకరు మృతి

77చూసినవారు
గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి ఓ గోదాంలో పనిచేస్తున్న కార్మికులపై గోధుమల బస్తాలు పడ్డాయి. ఈ ఘటనలో ఒక కూలీ మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తోటి కూలీలు బస్తాలను తొలగించి కింద చిక్కుకున్న కూలీలను బయటకు తీశారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్