బిహార్లోని జేడీ(యూ) ప్రభుత్వానికి షాక్ తగిలింది. బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ చేసిన అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. బిహార్కు ప్రత్యేక హోదాను నిరాకరించింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి జాతీయ అభివృద్ధి మండలి-ఎన్డీసీ ఐదు నిబంధనలు పెట్టిందని.. ఆ నిబంధనల ప్రకారం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది.