తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ కీలక సూచనలు చేసింది. తొమ్మిదేళ్లలో ప్రభుత్వం ఒక్క మినరల్ బ్లాక్ను కూడా వేలం వేయలేదని, జూన్ 30 నాటికి కనీసం ఆరింటికి వేలం పూర్తి చేయాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్కు 11 బ్లాకుల జియాలాజికల్ నివేదికలను పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీటిలో ఐదు ఇనుప ఖనిజం, ఐదు సున్నపురాయి, ఒకటి మాంగనీస్ బ్లాకు ఉన్నట్లు తెలిపాయి.