రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా చాహల్ రికార్డు సృష్టించారు. జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ టోర్నీతో ఇప్పటివరకు 153 మ్యాచులు ఆడిన చాహల్ గతంలో ఎంఐ, ఆర్సీబీ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. చాహల్ తర్వాత సీఎస్కే మాజీ ఆటగాడు డ్వేన్ బ్రేవో 183 వికెట్లతో 2వ స్థానంలో ఉన్నారు.