వాటర్ ట్యాంక్‌లో పసికందును పడేసిన తల్లి

583చూసినవారు
వాటర్ ట్యాంక్‌లో పసికందును పడేసిన తల్లి
యూపీ బస్తీ జిల్లాలో తాజాగా హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 5 నెలల పాపను తల్లి వాటర్ ట్యాంక్‌లో ముంచి హత్య చేసింది. హరయ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని అమరి బజార్‌లో ఈ ఘటన జరిగింది. ఇంట్లో అత్తమామలు ఓ వివాహ వేడుకకు వెళ్లారు. ఆ సమయంలో ఆ మహిళ తన కుమార్తెను ఇంటి పై ఉన్న వాటర్ ట్యాంకులో పడేసింది. తమ కోడలుకు దెయ్యం పట్టిందని ఆమె అత్తమామలు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్