GST తనిఖీల కోసం వచ్చిన డీఆర్ఐ అధికారులపై దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో బీజేపీ నేత సీఎం రమేష్పై కేసు నమోదైంది. ఆయన అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, వారిని బెదిరింపులకు గురి చేశారని విశాఖ జిల్లా చోడవరం పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. రమేష్ సహా ఆరుగురిని నిందితుల జాబితాలో చేర్చారు. కాగా, కూటమి తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా రమేష్ పోటీ చేస్తున్నారు.