శ్రీకాకుళం జిల్లా నేత, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆమెకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, ఏప్రిల్ 3వ తేదీన వైసీపీకి కృపారాణి రాజీనామా చేశారు. వైసీపీలో తనకు అన్యాయం, అవమానం జరిగిందని మండిపడ్డారు. కేబినెట్ ర్యాంక్, ఎంపీ టికెట్ ఇస్తామని మోసం చేశారని విమర్శించారు.