ఢిల్లీ మంత్రి అతిషికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీలో చేరాలని లేదంటే ఈడీని ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు వ్యక్తులు తనను సంప్రదించారని అతిషి ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిందే. అతిషి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ తాజాగా స్పందించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం అతిషికి నోటీసులు పంపింది. ఏప్రిల్ 8 మధ్యాహ్నం 12 గంటలలోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.