బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ స్విమ్మింగ్ పూల్ జంక్షన్ సమీపంలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ రోడ్డుపై ఎద్దును తీసుకుని వెళ్తోంది. ఆ సమయంలో ఆమెకు ఎదురుగా స్కూటర్పై ఓ వ్యక్తి వచ్చాడు. ఆ స్కూటరిస్ట్ను ఒక్కసారిగా ఎద్దు ఢీకొట్టింది. దీంతో ఆ స్కూటరిస్ట్ ఎగిరి, అటుగా వెళ్తున్న ట్రక్కు కింద పడ్డాడు. ట్రక్కు డ్రైవర్ బ్రేకులు వేయడంత స్కూటరిస్ట్ ప్రాణాలు నిలిచాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.