ఔరంగజేబు సమాధిని తొలగించాలనే వివాదం నేపథ్యంలో ఛావా మూవీని బ్యాన్ చేయాలని ముస్లిం మతాధికారి మౌలానా రజ్వీ కేంద్రమంత్రి అమిత్షాకు లేఖ రాశారు. మూవీలో ఔరంగజేబు పాత్రని రెచ్చగొట్టే విధంగా చిత్రీకరించారని లేఖలో పేర్కొన్నారు. ఛావా మతపరమైన అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఉందని, వెంటనే మూవీని నిషేదించాలని డిమాండ్ చేశారు. ఛావా రచయితలు, దర్శకుడు, నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.