తెలంగాణ వ్యవసాయం, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో హైదరాబాద్, చెన్నై జర్మన్ కాన్సులేట్ జనరల్స్ సమావేశమయ్యారు. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన ఈ భేటీలో ఇండో జర్మన్ విత్తన రంగ సహకార ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. వ్యవసాయ రంగానికి సహకారం అందించాలని హైదరాబాద్, చెన్నై జర్మన్ కాన్సులేట్ జనరల్స్ మంత్రి తుమ్మల కోరారు.