నూతన ఆవిష్కరణలు చేయడంలో చైనా దేశం ఎప్పుడూ ముందుంటుంది. తక్కువ సమయంలో చైనా అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటుంది. ఈ క్రమంలో తన సొంత రికార్డునే చైనా బ్రేక్ చేసుకుంది. గంటకు సుమారు 623 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే మోగ్లెవ్ రైలును విజయవంతంగా పరీక్షించింది. త్వరలోనే విమానంతో సమాన వేగంతో డ్రాగన్ దేశం రైలును నడపనుంది.