మధ్యప్రదేశ్లో కలరా వ్యాప్తి కలకలం రేపుతోంది. భింద్ జిల్లాలోని ఫూప్ టౌన్లో నీరు కలుషితం కావడంతో ఇద్దరు వృద్ధులు మరణించగా.. 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ DK శర్మ మాట్లాడుతూ.. నీటి ఇన్ఫెక్షన్ కారణంగా కలరా వ్యాప్తి చెందిందని వెల్లడించారు. దీంతో ఆ నీరు తాగిన వాళ్లు అస్వస్థకు గురయ్యారని అన్నారు. క్షతగాత్రులు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.