రిషికేశ్కి ఆధ్యాత్మిక అనుభూతి కోసం దేశవ్యాప్తంగా సందర్శకులు వస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అక్కడ యుద్ధ వాతారణం నెలకొంది. రాఫ్టింగ్ గైడ్లు-పర్యాటకులు ఒకరినొకరు తెడ్డులతో కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అసలేం జరిగిందో తెలియదు గాని..తెప్పల కోసం వచ్చిన పర్యాటకులకు బోట్మెన్ల మధ్య ఘర్షణ జరిగింది. తెడ్డులను ఆయుధాలుగా ఉపయోగించి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన గంగానది ఒడ్డున జరుగగా.. అనేక మంది పర్యాటకులు గాయపడ్డారు.