మణిపూర్ మళ్లీ చెలరేగిన హింస.. కారణం ఇదే!

62చూసినవారు
మణిపూర్ మళ్లీ చెలరేగిన హింస.. కారణం ఇదే!
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. జీరీబామ్ జిల్లాలో అనుమానిత మిలిటెంట్లు రెండు పోలీసు అవుట్ పోస్టులను దగ్ధం చేశారు. అటవీశాఖ కార్యాలయంతో పాటు 70 ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో ప్రభుత్వం.. జిల్లా ఎస్పీని బదిలీ చేసింది. రాజధాని ఇంఫాల్ నుంచి 70 మంది కమాండోలను జీరీబామ్ జిల్లాకు పంపించింది. ఓ వర్గానికి చెందిన 59 ఏళ్ల వ్యక్తి హత్యకు గురవడంతో ఈ తాజా అల్లర్లు చెలరేగాయి.

సంబంధిత పోస్ట్