నిజామాబాద్ పట్టణంలోని అర్సపల్లి చౌరస్తాలో యువకులు ఘర్షణకు పాల్పడ్డారు. పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద కత్తులతో దాడి చేసుకున్నారు. ఇద్దరు యువకులు గంజాయి మత్తులో దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఫిరోజ్ఖాన్ను అక్రమ్ అనే యువకుడు గొంతుపై పొడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.