ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం రాంచంద్రాపూర్లోని రఘునాథ్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో తోటి విద్యార్థిని ఒక స్టూడెంట్ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కత్తితో పొడిచిన 14 ఏళ్ల స్టూడెంట్ను అదుపులోకి తీసుకున్నారు.