TG: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అట్టర్ ఫ్లాప్ అని సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారంటూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం కేటీఆర్ మాట్లాడుతూ.. "రూ.70 వేల కోట్ల ఆదాయం తగ్గిందని సీఎం ఒప్పుకున్నారు. ఇంతకంటే రాష్ట్రానికి ఘోరమైన అవమానం ఇంకొకటి ఉండదు. బడ్జెట్ కంటే ముందే నేరాన్ని అంగీకరించి అప్రూవర్గా మారారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి సీఎం విధానాలే కారణం." అని అన్నారు.