చదరంగంలో వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ -175 పజిల్స్లో నారా దేవాన్స్ ఇటీవల ప్రపంచ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. దేవాన్స్ దీనిని 11:59 నిమిషాలలో పూర్తి చేయగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మహేష్-చంద్రకళ దంపతుల కుమారుడు కార్తికేయ తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఐదో తరగతి చదువుతున్న కార్తికేయ 9.41 నిమిషాల్లోనే 180 బోర్డులపై వేగంగా పావులు కదుపుతూ పజిల్స్ పరిష్కరించి సరికొత్త రికార్డు సృష్టించాడు.