TG: వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా ఇళ్లు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే పశువులు చనిపోయిన బాధితులకు రూ. 50 వేలు అందిస్తామని ప్రకటించారు. వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారంగా రూ. 10 వేలు ఇస్తామన్నారు.