తెలంగాణలో లోక్ సభ
ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రదేశ్
కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉండనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే
కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. జూన్ నెలాఖరులో లోకల్ బాడీ
ఎన్నికలు ఉండటంతో ఆలోగానే కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. దీంతో ఆశావహులు చాలామంది దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు.