సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ కారణం చేత వరంగల్ టూర్ శనివారంకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. నేడు జరగాల్సిన పోగ్రామ్స్ యధావిధిగా శనివారంకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. పీసీసీ చీఫ్, క్యాబినెట్ విస్తరణపై నేడు కూడా పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ చర్చలు కొనసాగించనున్నారు.