కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు పోక్సో కేసు నమోదు చేశారు. ఓ కేసులో సహాయం కోసం అతని ఇంటికి వెళ్లిన తన కుమార్తె (17 ఏళ్లు)ను అసభ్యంగా తాకాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి క్యాన్సర్తో బాధపడుతూ గత నెలలో మృతి చెందింది. సత్వర న్యాయం చేయాలని కోరుతూ ఆమె సోదరుడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో యడ్యూరప్పపై సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది.