మాజీ సీఎం
కేసీఆర్, ఏపీ సీఎం
జగన్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 'తెలంగాణకు అన్యాయం చేస్తూ గతంలో పోతిరెడ్డి పాడు నుంచి YSR నీటిని తరలించుకుపోయారు. తర్వాత
జగన్ మోహన్ రెడ్డి,
కేసీఆర్ ఇంటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలు తిని కృష్ణా నీళ్లపై 6 గంటలు చర్చించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 TMCల నీటిని తరలించుకుపోవడానికి
కేసీఆర్ దగ్గర అనుమతి తీసుకున్నారు. ఆ జీవో 2020లో ఆమోదం పొందింది' అని రేవంత్ వ్యాఖ్యానించారు.