తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఐదు గంటలకు రెగ్యులర్ ఫ్లైట్లో వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రేపు కీలక భేటీకి పిలుపునిచ్చింది. లోక్సభ ఎన్నికల తర్వాత జరుగనున్న మొదటి సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు రేవంత్ రెడ్డి హస్తినా టూర్కు వెళ్తున్నారు.