AP: టీచర్ల బదిలీల కోసం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ లంచాలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై బొత్స స్పందింస్తూ.. "అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అవసరం, అగత్యం నాకు లేదు. టీచర్ల బదిలీలు నిలిపేయాల్సిందిగా నేనే అధికారులకు విజ్ఞప్తి చేశా. బదిలీల్లో అవకతవకలు జరిగాయనేది అవాస్తవం. కొత్త ప్రభుత్వం టీచర్ల బదిలీలపై నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు." అని పేర్కొన్నారు.