ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. టోల్ ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకు టోల్ బూత్ నుంచి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. రోడ్డు దాటుతున్న టోల్ బూత్ ఉద్యోగి హేమ్రాజ్ అనే వ్యక్తిని వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరి కారు బానెట్పై పడగా కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఢిల్లీ-లక్నో హైవేపై ఉన్న ఛిజర్సీలోని టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.