కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫిర్యాదు

69చూసినవారు
కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
మంత్రి కొండా సురేఖపై సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత మొదలైంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీకి వినతి పత్రం అందజేశారు. అన్ని నియోజకవర్గాల్లో కొండా వర్గీయులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇదే విషయమై బుధవారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలవనున్నారు. కాగా, ఇటీవల మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలతో చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్