బీజేపీ కంచుకోట అయిన యూపీలో
కాంగ్రెస్ నేతృత్వంలోని
ఇండియా కూటమి 43 సీట్లను గెలుచుకుంది. దీంతో ఇంతటి భారీ విజయాన్ని కట్టబెట్టిన ఉత్తరప్రదేశ్లో
కాంగ్రెస్ పార్టీ జూన్ 11 నుంచి 15 వరకు ‘ధన్యవాద యాత్ర’ నిర్వహించనుంది. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్రలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.